రియాద్:విజిట్ వీసా గడువు పెంపు..సౌదీలో చిక్కకుపోయిన యాత్రికులకు ఊరట
- March 17, 2020
రియాద్:ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను రద్దు చేసిన నేపథ్యంలో సౌదీలోని విజిటర్లకు విజిట్ వీసా గడువును పెంచాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిటర్లు ఈ-ప్లాట్ ఫాం అబ్షెర్ ద్వారా అప్లై చేసి వీసా గడువును పెంచుకోవచ్చు. ఒక వేళ ఆన్ లైన్ లో కుదరకపోతే పాస్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుకు వెళ్లి విజిట్ వీసా గడువును పెంచుకోవచ్చని విజిటర్లకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ ఫ్లైట్లను రెండు వారాల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే సౌదీ పర్యటనలో ఉన్న విదేశీయులు దేశంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే విదేశీయుల విజిట్ విసా గడువును పెంచారు. ఇదిలాఉంటే సౌదీ అరేబియాలో నిన్న ఒక్క రోజే కొత్తగా 15 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య 118కి పెరిగింది. ఇందులో ముగ్గురు రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







