రియాద్:విజిట్ వీసా గడువు పెంపు..సౌదీలో చిక్కకుపోయిన యాత్రికులకు ఊరట
- March 17, 2020
రియాద్:ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను రద్దు చేసిన నేపథ్యంలో సౌదీలోని విజిటర్లకు విజిట్ వీసా గడువును పెంచాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిటర్లు ఈ-ప్లాట్ ఫాం అబ్షెర్ ద్వారా అప్లై చేసి వీసా గడువును పెంచుకోవచ్చు. ఒక వేళ ఆన్ లైన్ లో కుదరకపోతే పాస్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుకు వెళ్లి విజిట్ వీసా గడువును పెంచుకోవచ్చని విజిటర్లకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ ఫ్లైట్లను రెండు వారాల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే సౌదీ పర్యటనలో ఉన్న విదేశీయులు దేశంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే విదేశీయుల విజిట్ విసా గడువును పెంచారు. ఇదిలాఉంటే సౌదీ అరేబియాలో నిన్న ఒక్క రోజే కొత్తగా 15 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య 118కి పెరిగింది. ఇందులో ముగ్గురు రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







