యూఏఈ సహా జీసీసీ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌

- March 17, 2020 , by Maagulf
యూఏఈ సహా జీసీసీ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌

ఇండియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, క్వారంటైన్‌ని 14 రోజులపాటు తప్పనిసరి చేసింది వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకి. యూఏఈ, ఖతార్‌, ఒమన్‌ మరియు కువైట్‌ ద్వారా వచ్చేవారికి మార్చి 18 నుంచి ఈ క్వారంటైన్‌ని తప్పనిసరి చేస్తున్నారు. దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు, అలాగే టర్కీ మరియు యునైటెడ్‌ కింగ్‌డమ్ నుంచి వచ్చేవారికీ క్వారంటైన్‌ తప్పనిసరిగా అమలు చేస్తారు. ఏ ఎయిర్‌లైన్‌ కూడా ఈ దేశాల నుంచి వచ్చేవారికి బోర్డింగ్‌ సౌకర్యం కల్పించకూడదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com