విదేశాల్లో ఉన్న ఎమిరాతీస్ వెంటనే తిరిగి రావాలని కోరిన యూఏఈ
- March 17, 2020
కరోనా ఎఫెక్ట్ తో పలు దేశాలు ఫ్లైట్స్ సర్వీసులను నిలిపివేస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని యూఏఈ కోరింది. విదేశీ పర్యటనలో ఉన్నా, చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారి కోసం విదేశాంగ శాఖ ఈ సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఫ్లైట్ ప్రయాణాలపై మరింత రిస్ట్రిక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్ధులు అనారోగ్యం బారిన పడితే యూఏఈ ఎంబసీ ద్వారా స్కాలర్ షిప్ ఎజెన్సీలను సంప్రదించాలని కూడా సూచించింది. అలాగే విదేశాల్లో ఉన్న వారి అక్కడి మిషన్స్ ను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి అని అన్నారు.
ఇదిలాఉంటే పలు దేశాలు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫ్లై దుబాయ్ సర్వీసులను నిలిపివేశారు. మార్చి 31 వరకు బహ్రెయిన్, సౌదీ అరేబియాకు వెళ్లే ఫ్లైట్స్ ను రద్దు చేశారు. అలాగే మార్చి 14 నుంచి 19 కువైట్ ఫ్లైట్స్, మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఇండియా వెళ్లే సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇరాన్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, టర్కీ, సుడాన్ వెళ్లే ఫ్లైట్ సర్వీసులను కూడా రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు పునరుద్దరిస్తారో కూడా నిర్ణయించలేదు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







