విదేశాల్లో ఉన్న ఎమిరాతీస్ వెంటనే తిరిగి రావాలని కోరిన యూఏఈ
- March 17, 2020కరోనా ఎఫెక్ట్ తో పలు దేశాలు ఫ్లైట్స్ సర్వీసులను నిలిపివేస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని యూఏఈ కోరింది. విదేశీ పర్యటనలో ఉన్నా, చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారి కోసం విదేశాంగ శాఖ ఈ సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఫ్లైట్ ప్రయాణాలపై మరింత రిస్ట్రిక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్ధులు అనారోగ్యం బారిన పడితే యూఏఈ ఎంబసీ ద్వారా స్కాలర్ షిప్ ఎజెన్సీలను సంప్రదించాలని కూడా సూచించింది. అలాగే విదేశాల్లో ఉన్న వారి అక్కడి మిషన్స్ ను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి అని అన్నారు.
ఇదిలాఉంటే పలు దేశాలు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫ్లై దుబాయ్ సర్వీసులను నిలిపివేశారు. మార్చి 31 వరకు బహ్రెయిన్, సౌదీ అరేబియాకు వెళ్లే ఫ్లైట్స్ ను రద్దు చేశారు. అలాగే మార్చి 14 నుంచి 19 కువైట్ ఫ్లైట్స్, మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఇండియా వెళ్లే సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇరాన్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, టర్కీ, సుడాన్ వెళ్లే ఫ్లైట్ సర్వీసులను కూడా రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు పునరుద్దరిస్తారో కూడా నిర్ణయించలేదు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..