కరోనా ఎఫెక్ట్‌: విజిటర్స్‌ అందరికీ క్వారంటైన్‌

- March 17, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: విజిటర్స్‌ అందరికీ క్వారంటైన్‌

ఒమన్‌ సుల్తానేట్‌, విమానాల ద్వారా, సముద్రం మీదుగా, లేదా రోడ్డు మార్గంలో దేశంలోకి వచ్చేవారిని క్వారంటీన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కోవిడ్‌ 19 వైరస్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఒమనీయులతోపాటుగా అందరికీ క్వారంటీన్‌ తప్పనిసరి అని అధికారులు అంటున్నారు. దేశంలోకి వచ్చే ట్రాలెవర్స్‌ స్వచ్ఛందంగా క్వారంటీన్‌కి సహకరించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పార్కులు, పబ్లిక్‌ ప్లే ఏరియాస్‌ని ఇప్పటికే మూసి వేశారు. ఫ్రైడే ప్రార్థనల్నీ సస్పెండ్‌ చేయడం జరిగింది. 

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com