మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించండి:ఎంవీవీ

- March 20, 2020 , by Maagulf
మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి  రప్పించండి:ఎంవీవీ

తెలంగాణ రాష్ట్రాల తో పాటు పంజాబ్,కర్ణాటక ,తమిళనాడు  తక్కిన రాష్ట్రాలకు చెందిన సుమారు 41 మందిని తిరిగి  స్వదేశానికి తిరిగి రప్పించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ లో ఆయన  కార్యాలయానికి లేఖ రాశారు.ఈ సంధర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ  మలేషియా  లో చిక్కుకున్న ఆ 41 మందిని స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖ లో కోరామన్నారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని జై శంకర్ కు పంపామన్నారు. కరోన వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో  ఆయా రాష్ట్రాల కు చెందిన 41 మంది అక్కడ  చిక్కుకున్నారని. ఈ నేపధ్యంలో వారి తల్లి తండ్రులు ,కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భాదితుల తల్లితండ్రులు తనను కలిసి , ఈ విషయం పై ఆవేదన వెలిబుచ్చి, తగు న్యాయంచేయాలని కోరారన్నారు. ఈ క్రమంలో మలేషియా నగర ఎయిర్పోర్టు లో  సహాయార్ద్ధులై వేచి ఉన్న వారిని , తిరిగి రప్పించేందుకు చొరవచూపాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రికి లిఖిత పూర్వకంగా విన్నవించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com