మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించండి:ఎంవీవీ
- March 20, 2020
తెలంగాణ రాష్ట్రాల తో పాటు పంజాబ్,కర్ణాటక ,తమిళనాడు తక్కిన రాష్ట్రాలకు చెందిన సుమారు 41 మందిని తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ లో ఆయన కార్యాలయానికి లేఖ రాశారు.ఈ సంధర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ మలేషియా లో చిక్కుకున్న ఆ 41 మందిని స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖ లో కోరామన్నారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని జై శంకర్ కు పంపామన్నారు. కరోన వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో ఆయా రాష్ట్రాల కు చెందిన 41 మంది అక్కడ చిక్కుకున్నారని. ఈ నేపధ్యంలో వారి తల్లి తండ్రులు ,కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భాదితుల తల్లితండ్రులు తనను కలిసి , ఈ విషయం పై ఆవేదన వెలిబుచ్చి, తగు న్యాయంచేయాలని కోరారన్నారు. ఈ క్రమంలో మలేషియా నగర ఎయిర్పోర్టు లో సహాయార్ద్ధులై వేచి ఉన్న వారిని , తిరిగి రప్పించేందుకు చొరవచూపాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రికి లిఖిత పూర్వకంగా విన్నవించామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







