భారత్‌లో ఐదో కరోనా మరణం..

- March 20, 2020 , by Maagulf
భారత్‌లో ఐదో కరోనా మరణం..

జైపూర్:భారత్‌ దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్‌లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా.. భారత్‌లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక అటు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి సుమారు 10 వేల మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య 2,20,313కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com