30 రోజుల పాటు 'ఏసీకే', 'టింకిల్' యాప్స్ ఉచిత యాక్సెస్ ఆఫర్ చేసిన రానా
- March 20, 2020
కరోనా వైరస్ మీద నెలకొన్న భయాందోళనల కారణంగా సినిమా సహా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కార్యకలాపాల్ని నిలిపి వేయడంతో, ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అనేకమంది సెలబ్రిటీలు కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తన 'అరణ్య' చిత్రం విడుదలను వాయిదా వేసిన హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి, సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక చక్కని కానుకను ఆఫర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఏసీకే (అమర్ చిత్ర కథ), టింకిల్ యాప్స్లోని కంటెంట్ను ఉచితంగా తిలకించవచ్చని ప్రకటించారు. ఆ రెండు యాప్స్ ఆయనవే.
"ఏసీకే విషయంలో ఈ నెలలో ఆన్లైన్ సభ్యత్వాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఏసీకే, టింకిల్ యాప్స్లోని అద్భుతమైన కంటెంట్ను పిల్లలు, పెద్దలు కూడా ఉచితంగా చూసుకోవచ్చు. వాటిలో తమకు ఇష్టమైన దాన్ని చదువుకోవచ్చు. అందులోనివన్నీ మన ప్రాంతం కథలు. అవి చదివితే మన దేశం, మన దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చక్కని బొమ్మలు, కథలతో అవి అలరిస్తాయి. మన గతం గురించి తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడానికి నేటి తరానికి ఇది చాలా ముఖ్యం" అని రానా చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆసక్తికర ట్వీట్
- సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!









