నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ...
- January 24, 2016
మంత్రి గంటా శ్రీనివాసరావు నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ వర్గాలతోపాటు తమిళం, మళయాళం, ఇతర సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఇక్కడ షూటింగ్లు నిర్వహించుకునేలా విశాఖపట్నంను తీర్చిదిద్దుతా మని అన్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్ సమావేశ మందిరంలో చాంబర్ ప్రతినిధులు ఆదివారం ఆయనను సన్మా నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరుపున కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నారని ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులకు తెలిపారు. సకల సౌకర్యాలతో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా మన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా మాత్రమే కాకుండా.. టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వైజాగ్లో నిర్మించబోయే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎనసీసీ) నిర్మాణంపై ప్రజెంటేషన ఇచ్చారు. కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అర్జున, సురేష్బాబుతోపాటు పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









