నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ...
- January 24, 2016
మంత్రి గంటా శ్రీనివాసరావు నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ వర్గాలతోపాటు తమిళం, మళయాళం, ఇతర సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఇక్కడ షూటింగ్లు నిర్వహించుకునేలా విశాఖపట్నంను తీర్చిదిద్దుతా మని అన్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్ సమావేశ మందిరంలో చాంబర్ ప్రతినిధులు ఆదివారం ఆయనను సన్మా నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరుపున కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నారని ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులకు తెలిపారు. సకల సౌకర్యాలతో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా మన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా మాత్రమే కాకుండా.. టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వైజాగ్లో నిర్మించబోయే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎనసీసీ) నిర్మాణంపై ప్రజెంటేషన ఇచ్చారు. కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అర్జున, సురేష్బాబుతోపాటు పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









