నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ...
- January 24, 2016
మంత్రి గంటా శ్రీనివాసరావు నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ వర్గాలతోపాటు తమిళం, మళయాళం, ఇతర సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఇక్కడ షూటింగ్లు నిర్వహించుకునేలా విశాఖపట్నంను తీర్చిదిద్దుతా మని అన్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్ సమావేశ మందిరంలో చాంబర్ ప్రతినిధులు ఆదివారం ఆయనను సన్మా నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరుపున కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నారని ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులకు తెలిపారు. సకల సౌకర్యాలతో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా మన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా మాత్రమే కాకుండా.. టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వైజాగ్లో నిర్మించబోయే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎనసీసీ) నిర్మాణంపై ప్రజెంటేషన ఇచ్చారు. కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అర్జున, సురేష్బాబుతోపాటు పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







