తమిళ దర్శక నిర్మాత విసు కన్నుమూత
- March 22, 2020చెన్నై:ప్రముఖ నటుడు దర్శకుడు, సినీ రచయిత విసు చెన్నైలో కన్నుమూశారు.గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.ఆయన ఆకస్మిక మరణం సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాధన్. ఆయనను ముద్దుగా విసు పిలుచుకొనే వారు. 1945 జూలైలో జన్మించిన ఆయన వయసు 75 సంవత్సరాలు. తెలుగు సినిమా పరిశ్రమకు దాదాపు 30 ఏళ్లకుపైగా సేవలందించారు. వెండితెర, టెలివిజన్పై కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు.
సంసారం ఒక చదరంగం, చిదంబర రహస్యం, ఆడదే ఆధారం లాంటి చిత్రాలను రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం చేపట్టారు. పలు సినిమాలకు మాటలు రాశారు. ఆయన సినిమాల్లో సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు ఎక్కువగా కనిపించేవి.
సినిమాల నుంచి దూరమైన తర్వాత 2016లో ఆయన బీజేపీలో చేరారు. జాతీయభావం, ఆధ్యాత్మికభావం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. కానీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. వయసుపై బడటంతో పార్టీకి పెద్దగా సేవలు అందించలేకపోయారని సన్నిహితులు చెప్పుకొంటారు.
ఆయన మరణ వార్తను తెలుసుకొన్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్