కరోనావైరస్: యూఏఈ: ప్రయాణీకుల విమానాలు రద్దు..మాల్స్ మూసివేత మరియు స్టే-హోమ్ ఆర్డర్లు జారీ
- March 23, 2020యూఏఈ: కొరోనా మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటున్న విషయం తెలిసిందే. మరి దీన్ని నియంత్రించే క్రమంలో దేశాలన్నీ కూడా 'Stay at Home' (ఇంటి వద్దనే ఉండండి) అని అంటున్నాయి. తాజాగా యూఏఈ కూడా ప్రజలను తప్పనిసరైతే తప్పించి ఇంటి వద్దనే ఉందామంటూ పిలుపునిచ్చింది.
రానున్న 48 గంటల్లో అన్ని ప్యాసింజర్ విమానాల రాకపోకలను నిలిపివేయనుంది. కార్గో మరియు అత్యవసర తరలింపు విమానాలు కొనసాగుతాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. మరియు మాల్స్ మూతబడనున్నాయి. సోమవారం తెల్లవారుజామున తీసుకున్న ఈ నిర్ణయం, కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దోహదపడుతుందని తెలిపిన అధికారులు. ఈ ఆంక్షలు రెండు వారాల పాటు ఉంటాయనీ, అవసరమైతే పొడిగించబడతాయి అని కూడా ధృవీకరించిన అధికారులు.
మాల్స్ మూతబడనున్నాయి కానీ సూపర్మార్కెట్లు, ఫార్మసీలు మరియు చేపలు, మాంసం మరియు కూరగాయల మార్కెట్లకు మినహాయింపు ఉంటుంది. హోటళ్లు కూడా మూతబడనున్నాయి కానీ హోమ్ డెలివరీ లు లభ్యమవుతాయి అని వివరణ ఇచ్చింది ప్రభుత్వం.
ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, పార్టీలు, కుటుంబ సమావేశాలు పరిమితం చేయాలనీ, ప్రజలు తమ సొంత వాహనాలను ఉపయోగించాలని, అయితే వారిలో ఉన్న వారి సంఖ్యను మూడుకి పరిమితం చేయాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులను సందర్శించవద్దని ప్రజలను అర్ధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎమర్జెన్సీ శాఖ.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ