కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ
- March 25, 2020
కరోనా వైరస్ కారణంగా సరుకుల కొరతను సొమ్ము చేసుకోవాలనే వ్యాపారులపై కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనఖీ టీమ్స్ దాదాపు 151 సహాకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార దుకాణాలు, కూరగాయల షాపులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు తగిన ధరల్లో నిత్యావసర సరుకులు అందించటమే లక్ష్యంగా తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారులకు సరైన విధంగా ఆహార సామాగ్రి అందించేందుకు తనిఖీ టీమ్స్ 39 క్యాటరింగ్ బ్రాంచులను టేకోవర్ చేసుకున్నాయి. అలాగే 8 బేకరిలను కూడా తమ శాఖకు అనుసంధానం చేశాయి. ఇప్పటివరకు అత్యవసర సేవా కేంద్రానికి 135 హాట్ లైన్ ద్వారా 265 ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సొంత లాభాలకు వాడుకోవాలని చూసే వ్యాపారుల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







