కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ
- March 25, 2020కరోనా వైరస్ కారణంగా సరుకుల కొరతను సొమ్ము చేసుకోవాలనే వ్యాపారులపై కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనఖీ టీమ్స్ దాదాపు 151 సహాకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార దుకాణాలు, కూరగాయల షాపులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు తగిన ధరల్లో నిత్యావసర సరుకులు అందించటమే లక్ష్యంగా తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారులకు సరైన విధంగా ఆహార సామాగ్రి అందించేందుకు తనిఖీ టీమ్స్ 39 క్యాటరింగ్ బ్రాంచులను టేకోవర్ చేసుకున్నాయి. అలాగే 8 బేకరిలను కూడా తమ శాఖకు అనుసంధానం చేశాయి. ఇప్పటివరకు అత్యవసర సేవా కేంద్రానికి 135 హాట్ లైన్ ద్వారా 265 ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సొంత లాభాలకు వాడుకోవాలని చూసే వ్యాపారుల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు