లాక్డౌన్ను పొడిగించం:కేంద్ర కేబినెట్ కార్యదర్శి
- March 30, 2020
ఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలనుభారత కేంద్రం కొట్టిపారేసింది. లాక్డౌన్ గడువు పెంచుతారన్న వదంతులు అవాస్తమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం భారత కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పందించారు.భారత దేశ వ్యాప్త లాక్డౌన్ 21 రోజులేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. కాగా, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 21 రోజుల భారత దేశ వ్యాప్త లాక్డౌన్కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా చైన్ను తెంచడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవాలని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి లాక్డౌన్ గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెట్టే (ముఖ్యంగా పేద ప్రజల్ని) నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణ కోరారు. కరోనాను అదుపు చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదని, ప్రజలు తనను తప్పకుండా క్షమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం