యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్

- March 30, 2020 , by Maagulf
యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్

యూఏఈ/అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ 'షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్', కరోనావైరస్ పరీక్షల కోసం అబుధాబీలో డ్రైవ్-త్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేంద్రాలను యూఏఈ అంతటా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  

రాబోయే 10 రోజుల్లో, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్‌, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఈ డ్రైవ్-త్రూ కేంద్రాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉంటాయి అని అబుదాబి మీడియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.

కొత్త కేంద్రాల సంప్రదింపు వివరాలు, నియామక విధానాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రకటించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com