భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే
- March 30, 2020ప్రముఖ సోషల్మీడియా మెసెంజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. ఇప్పటివరకు ౩౦ సెకండ్ల వరకు ఉన్న వీడియోల నిడివిని తాజాగా 15 సెకండ్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు వాబెటాఇన్ఫో ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 15 సెకండ్లకు మించి నిడివి ఉన్న వీడియోలు స్టేటస్లో ఇకనుంచి అప్లోడ్ కావు. వాట్సాప్లో పెరిగిపోయిన ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..