కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం

- April 01, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం

దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే  జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే  ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com