చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ..
- April 01, 2020
బీజింగ్:మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టేందుకు సిద్దం చేస్తున్న వ్యాక్సిన్కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని వుహన్ నగరంలో ఈ వ్యాక్సిన్పై పరీక్షలు నిర్వహిస్తుండగా.. అవి పూర్తిగా సురక్షితం, విజయవంతం అయితే.. ఇకపై విదేశాల్లో ట్రయిల్స్ చేసేందుకు యోచిస్తున్నట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు.
అక్కడి ప్రభుత్వం అనుమతితో ఈ వ్యాక్సిన్కు తొలిదశ ట్రయిల్స్ ను వుహన్ లో మార్చి 16న మొదలుపెట్టారు. ఇది సజావుగా సాగుతోందని, దీని ఫలితాలు ఏప్రిల్లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ తెలిపారు. ఇక చైనాలో ఉండే విదేశీయులపై కూడా ప్రయోగిస్తామన్నారు.
వూహాన్లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ అక్కడి ప్రజలను రెండు నెలల పాటు గడగడలాడించింది. పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయి. 'ప్రారంభ ఫలితాల్లో వ్యాక్సిన్ సురక్షితం అని నిరూపణ అయ్యి.. మంచి ప్రభావాన్ని చూపిస్తే.. అంతర్జాతీయ దేశాల సాయంతో విదేశాల్లో కూడా దీనిపై ట్రయిల్స్ నిర్వహిస్తామని చెన్ తెలిపినట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక తెలియజేశారు . కరోనా ప్రభావిత దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను తొందర్లోనే వాడొచ్చని చెన్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అంతర్జాతీయ దేశాలకు సహకరించేందుకు తాను, తన టీం ఎలప్పుడూ సిద్దంగా ఉన్నామని ఆమె వెల్లడించింది. ఉన్నట్టు చెన్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







