చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ..
- April 01, 2020
బీజింగ్:మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టేందుకు సిద్దం చేస్తున్న వ్యాక్సిన్కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని వుహన్ నగరంలో ఈ వ్యాక్సిన్పై పరీక్షలు నిర్వహిస్తుండగా.. అవి పూర్తిగా సురక్షితం, విజయవంతం అయితే.. ఇకపై విదేశాల్లో ట్రయిల్స్ చేసేందుకు యోచిస్తున్నట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు.
అక్కడి ప్రభుత్వం అనుమతితో ఈ వ్యాక్సిన్కు తొలిదశ ట్రయిల్స్ ను వుహన్ లో మార్చి 16న మొదలుపెట్టారు. ఇది సజావుగా సాగుతోందని, దీని ఫలితాలు ఏప్రిల్లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ తెలిపారు. ఇక చైనాలో ఉండే విదేశీయులపై కూడా ప్రయోగిస్తామన్నారు.
వూహాన్లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ అక్కడి ప్రజలను రెండు నెలల పాటు గడగడలాడించింది. పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయి. 'ప్రారంభ ఫలితాల్లో వ్యాక్సిన్ సురక్షితం అని నిరూపణ అయ్యి.. మంచి ప్రభావాన్ని చూపిస్తే.. అంతర్జాతీయ దేశాల సాయంతో విదేశాల్లో కూడా దీనిపై ట్రయిల్స్ నిర్వహిస్తామని చెన్ తెలిపినట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక తెలియజేశారు . కరోనా ప్రభావిత దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను తొందర్లోనే వాడొచ్చని చెన్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అంతర్జాతీయ దేశాలకు సహకరించేందుకు తాను, తన టీం ఎలప్పుడూ సిద్దంగా ఉన్నామని ఆమె వెల్లడించింది. ఉన్నట్టు చెన్ తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







