కరోనా ఎఫెక్ట్:36 వేల మంది ఉద్యోగులపై సస్పెన్షన్
- April 02, 2020లండన్:బ్రిటీష్ ఎయిర్వేస్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది. దీనిపై ఆ కంపెనీ త్వరలోనే నిర్ణయం వెలుబడించనున్నది. కరోనా సంక్షోభం వల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ఒప్పందం కుదర్చుకోనున్నది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్వేస్ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు.. ప్రభుత్వ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొందనున్నారు. వారికి నెలకు 2500 పౌండ్లు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం