మర్కజ్ ఎఫెక్ట్: 960 మంది విదేశీయుల వీసాలు రద్దు..
- April 03, 2020
ఢిల్లీ:భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్లో పాల్గొని..దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. 'హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారి భారత వీసాలు కూడా రద్దు చేయబడ్డాయి' అని హోంమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
విదేశీయుల చట్టం 1946.. విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సంబంధిత సెక్షన్లు ఉల్లంఘించిన వారందరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలను.. ఢిల్లీ పోలీసు కమిషనర్ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ప్రార్థనల్లో పాల్గొన్న అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు దేశాలకు చెందిన 1,300 మంది విదేశీ తబ్లిగి జమాత్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో గుర్తించబడ్డారని, వారిలో ఎక్కువ మందిని ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు .
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







