మర్కజ్ ఎఫెక్ట్: 960 మంది విదేశీయుల వీసాలు రద్దు..
- April 03, 2020
ఢిల్లీ:భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్లో పాల్గొని..దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. 'హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారి భారత వీసాలు కూడా రద్దు చేయబడ్డాయి' అని హోంమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
విదేశీయుల చట్టం 1946.. విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సంబంధిత సెక్షన్లు ఉల్లంఘించిన వారందరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలను.. ఢిల్లీ పోలీసు కమిషనర్ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ప్రార్థనల్లో పాల్గొన్న అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు దేశాలకు చెందిన 1,300 మంది విదేశీ తబ్లిగి జమాత్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో గుర్తించబడ్డారని, వారిలో ఎక్కువ మందిని ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు .
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







