కరోనా ఎఫెక్ట్: ప్రవాసీయులు యూఏఈకి రావాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే..!
- April 03, 2020
యూఏఈ:విదేశాల్లో ఉన్న యూఏఈ వీసా హోల్డర్స్ తిరిగి యూఏఈ చేరుకునేందుకు మరికొన్నాళ్లు వేచి ఉండాల్సిందే. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే విదేశాల్లో ఉన్న ప్రవాసీయుల రాకను రెండు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. అంతర్జాతీయ సహాకర, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. యూఏఈ రెసిడెన్స్ వీసాదారులు ఇప్పటికే విదేశాల్లో ఉన్నా లేదంటే వారి సొంత దేశాల్లో ఉన్నా..అక్కడ్నుంచి యూఏఈకి రావాలంటే మరో రెండు వారాల తర్వాతే అనుమతిస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెసిడెంట్స్ కి తమ ప్రకటనలో వివరించింది. అయితే..అత్యవసరంగా యూఏఈ రావాలనుకునే వారు మాత్రం ఇటీవలె ప్రారంభించిన తవజుది ఫర్ రెసిడెంట్స్ సేవలను వినియోగించుకొని తమ పేర్లను ఈ క్రింద ఇచ్చిన లింకు లో నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది.
లింకు: https://www.mofaic.gov.ae/en/services/twajudi-resident
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







