లాక్డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు:కేసీఆర్
- April 06, 2020హైదరాబాద్:రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ధికంగా దెబ్బతింటే కోలుకుంటామని అన్న కేసీఆర్.. ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమని చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే భారత్లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్లో ఉంచామని చెప్పారు.. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మంది కరోనా భారిన పడ్డారని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ చేశామని.. వైరస్ భారిన పడి 11 మంది చనిపోయారని అన్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో వున్నారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిపారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం