గోఎయిర్ ఎయిర్లైన్స్: ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్
- April 06, 2020ముంబై:ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోఎయిర్ ప్రతినిధి వెల్లడించారు. గోయిర్ సంస్థ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. గత వారం, భారతదేశ జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు అన్ని విమానాల కోసం ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ మార్చి 25 నుండి కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దాంతో దేశీయ విమానాలు ఆగిపోయాయి, కానీ అంతకు ముందే చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.. దీనికి కారణం ప్రయాణికులు లేకపోవడమే. ఈ క్రమంలో గోఎయిర్ సంస్థ లాక్ డౌన్ తరువాత రోజు బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించడం కీలక పరిణామంగా మారింది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు