గోఎయిర్ ఎయిర్లైన్స్: ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్
- April 06, 2020
ముంబై:ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోఎయిర్ ప్రతినిధి వెల్లడించారు. గోయిర్ సంస్థ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. గత వారం, భారతదేశ జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు అన్ని విమానాల కోసం ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ మార్చి 25 నుండి కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దాంతో దేశీయ విమానాలు ఆగిపోయాయి, కానీ అంతకు ముందే చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.. దీనికి కారణం ప్రయాణికులు లేకపోవడమే. ఈ క్రమంలో గోఎయిర్ సంస్థ లాక్ డౌన్ తరువాత రోజు బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించడం కీలక పరిణామంగా మారింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







