తెలంగాణలో 531కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
- April 12, 2020
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించి, రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు ఆస్పత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందగా.. వైరస్ నుంచి కో లుకుని 103 మంది దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 412 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..