తెలంగాణలో 531కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య

- April 12, 2020 , by Maagulf
తెలంగాణలో 531కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించి, రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు ఆస్పత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 531కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందగా.. వైరస్‌ నుంచి కో లుకుని 103 మంది దవాఖానల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 412 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com