కరోనా: ఎమిరేట్స్ టిక్కెట్లు 2 సంవత్సరాలు చెల్లుతాయి
- April 13, 2020
దుబాయ్: కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్. ప్రయాణీకులు తాము బుక్ చేసుకున్న టికెట్లపై 24 నెలల పొడిగింపును ప్రకటించింది. అంటే, మీరు బుక్ చేసుకున్న టికెట్ ను వాడికోవట్లేదే అని దిగులు పడక్కర్లేదు..దాని కాన్సిల్ చేసుకోకుండా 24 నెలల లోపు వాడుకోవచ్చు అది కూడా అదనపు చార్జీలు కట్టకుండా! కాబట్టి మీరు మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ఫ్లైట్ను రీ షెడ్యూల్ చేయడానికి మీరు ఎమిరేట్స్ కు కాల్ చేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని ప్రకటించారు.
ఈ సదుపాయం మే 31 లోపు చేసిన బుకింగ్ల పై మాత్రమే. జూన్ 1 నుండి బుకింగ్ల పై సమయానుకూలంగా బుకింగ్ ఛార్జీల షరతులు ఉంటాయని ఎమిరేట్స్ తెలిపింది. ముఖ్యంగా, 24 నెలల వ్యవధిలో ప్రయాణీకులు రీ బుక్ చేసినప్పుడు ఫీజులో ఎటువంటి మార్పు ఉండదని ఎయిర్లైన్స్ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







