కరోనా: ఎమిరేట్స్ టిక్కెట్లు 2 సంవత్సరాలు చెల్లుతాయి
- April 13, 2020
దుబాయ్: కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్. ప్రయాణీకులు తాము బుక్ చేసుకున్న టికెట్లపై 24 నెలల పొడిగింపును ప్రకటించింది. అంటే, మీరు బుక్ చేసుకున్న టికెట్ ను వాడికోవట్లేదే అని దిగులు పడక్కర్లేదు..దాని కాన్సిల్ చేసుకోకుండా 24 నెలల లోపు వాడుకోవచ్చు అది కూడా అదనపు చార్జీలు కట్టకుండా! కాబట్టి మీరు మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ఫ్లైట్ను రీ షెడ్యూల్ చేయడానికి మీరు ఎమిరేట్స్ కు కాల్ చేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని ప్రకటించారు.
ఈ సదుపాయం మే 31 లోపు చేసిన బుకింగ్ల పై మాత్రమే. జూన్ 1 నుండి బుకింగ్ల పై సమయానుకూలంగా బుకింగ్ ఛార్జీల షరతులు ఉంటాయని ఎమిరేట్స్ తెలిపింది. ముఖ్యంగా, 24 నెలల వ్యవధిలో ప్రయాణీకులు రీ బుక్ చేసినప్పుడు ఫీజులో ఎటువంటి మార్పు ఉండదని ఎయిర్లైన్స్ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







