భారత్:10వేలు దాటిన పాజిటివ్ కేసులు
- April 14, 2020
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 వేలు దాటింది. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మంగళావారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. దాంతో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.మరోవైపు గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు..
దాంతో మరణాల సంఖ్య కూడా 339 కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ల సంఖ్య 10,363కు ఉండగా. ఇప్పటివరకు 339 మంది మృత్యువాత పడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని వెల్లడించింది. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 17,76,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో మొత్తం 1,11,828 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







