త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జైలుపాలయ్యాడు: పాకిస్థాన్‌

- January 27, 2016 , by Maagulf
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జైలుపాలయ్యాడు: పాకిస్థాన్‌

భారత దేశ వ్యాప్తంగా మంగళవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. స్కూల్‌లు, కాలేజీలు, కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అయితే పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి కూడా తన ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారత క్రికెటర్‌ మీదున్న తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. కానీ.. ఆ అభిమానమే.. ఇప్పుడతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఒకారా జిల్లాకు చెందిన ఉమర్‌ ద్రాజ్‌ అనే వ్యక్తికి భారత క్రికెటర్‌ విరాట్‌కోహ్లి అంటే అభిమానం. నిన్న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌లో కోహ్లి అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన ఉమర్‌.. తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురవేశాడు. అయితే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అతడి ఇంటిపై దాడి చేసి.. జెండాను, కోహ్లి ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. అయితే దీనిపై ఉమర్‌ మాట్లాడుతూ.. తాను కేవలం కోహ్లి అంటే అభిమానంతోనే అలా చేశానని.. తానేమీ గూఢచారిని కాదని, దేశద్రోహిని అంతకన్నా కాదని చెప్పాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని వదిలిపెట్టాలని కోరుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com