త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జైలుపాలయ్యాడు: పాకిస్థాన్
- January 27, 2016
భారత దేశ వ్యాప్తంగా మంగళవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. స్కూల్లు, కాలేజీలు, కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అయితే పాకిస్థాన్లో ఓ వ్యక్తి కూడా తన ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారత క్రికెటర్ మీదున్న తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. కానీ.. ఆ అభిమానమే.. ఇప్పుడతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్లోని ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తికి భారత క్రికెటర్ విరాట్కోహ్లి అంటే అభిమానం. నిన్న భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్లో కోహ్లి అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన ఉమర్.. తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురవేశాడు. అయితే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అతడి ఇంటిపై దాడి చేసి.. జెండాను, కోహ్లి ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ను అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. అయితే దీనిపై ఉమర్ మాట్లాడుతూ.. తాను కేవలం కోహ్లి అంటే అభిమానంతోనే అలా చేశానని.. తానేమీ గూఢచారిని కాదని, దేశద్రోహిని అంతకన్నా కాదని చెప్పాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని వదిలిపెట్టాలని కోరుతున్నాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







