రెండు రాష్ట్రాలకు విభజన వల్ల లాభం: కేటీఆర్
- January 27, 2016
విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ ఫినిక్స్ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... సమైక్యాంధ్ర కొనసాగి ఉంటే మరో 25 ఏళ్లయినా అభివృద్ధి పనులు జరిగేవి కావన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 7 ఉంటే... రాష్ట్ర సగటు 16 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్ను బాగు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేదికాదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి మేలు జరిగిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంతం శరవేగంతో దూసుకెళ్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







