రెండు రాష్ట్రాలకు విభజన వల్ల లాభం: కేటీఆర్
- January 27, 2016
విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ ఫినిక్స్ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... సమైక్యాంధ్ర కొనసాగి ఉంటే మరో 25 ఏళ్లయినా అభివృద్ధి పనులు జరిగేవి కావన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 7 ఉంటే... రాష్ట్ర సగటు 16 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్ను బాగు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేదికాదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి మేలు జరిగిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంతం శరవేగంతో దూసుకెళ్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









