కరోనా/రస్ అల్ ఖైమా: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 19, 2020
యూఏఈ: రస్ అల్ ఖైమా కార్మికులు ఇతర ఎమిరేట్ లకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాస్ అల్ ఖైమా ఎమిరేట్ పరిధిలో మాత్రమే కార్మికులను రవాణా చేయవచ్చని RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ జనరల్ మేనేజర్ ఎస్మాయిల్ హసన్ అల్ బ్లూషి అన్నారు. కార్మికుల, పౌరుల ఆరోగ్య భద్రత తమ లక్ష్యమని వివరించారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను ఖాతరు చేయకుంటే వారిపై జరిమానా విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అలాగే కార్మికులు తరలించే సమయంలో రవాణ వాహనంలోని సామార్ధ్యానికి సగానికి మాత్రమే కార్మికులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్మికులు తప్పసరిగా మాస్కులు ధరించటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూడా బ్లూషి అన్నారు.
కరోనా ను కట్టడి చేయటంలో అబుధాబి, దుబాయ్, షార్జా కూడా ఇదే కోవలో కార్మికుల రాకపోకలపై షరతులు విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







