మస్కట్: పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకిందన్న పుకార్లను ఖండించిన ప్రభుత్వం
- April 19, 2020
మస్కట్:సుల్తానేట్ పరిధిలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ వైరస్ సోకటంతో అతను డోర్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త ప్రభుత్వ అధికారుల వరకు చేరటంతో..ప్రజల్లో నెలకొన్న అపోహలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. సుల్తానేట్ పరిధిలోని పిజ్జా డెలివరీ బాయ్ కి వైరస్ ఉన్న కేసులేవి తమ దృష్టికి రాలేదని, ఇది ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వార్త అని కూడా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







