మస్కట్: పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకిందన్న పుకార్లను ఖండించిన ప్రభుత్వం
- April 19, 2020
మస్కట్:సుల్తానేట్ పరిధిలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ వైరస్ సోకటంతో అతను డోర్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త ప్రభుత్వ అధికారుల వరకు చేరటంతో..ప్రజల్లో నెలకొన్న అపోహలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. సుల్తానేట్ పరిధిలోని పిజ్జా డెలివరీ బాయ్ కి వైరస్ ఉన్న కేసులేవి తమ దృష్టికి రాలేదని, ఇది ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వార్త అని కూడా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు