కోవిడ్ 19: కార్మికుల తరలింపుపై దుబాయ్ పోలీసుల బ్రేక్..చెక్ పోస్టుల ఏర్పాటు
- April 20, 2020
దుబాయ్:కరోనా వైరస్ కట్టడికి కార్మికుల కదలికలపై ఆంక్షలు విధించిన దుబాయ్ ఎమిరాతి అధికారులు..నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్, షార్జా ఎమిరాతి సరిహద్దుల్లో రెండువైపుల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక ఎమిరాతి నుంచి మరో ఎమిరాతికి నిబంధనల విరుద్ధంగా కార్మికుల తరలిస్తుండటంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అంతేకాదు..ప్రైవేట్ కార్లలో దుబాయ్, షార్జా మధ్య కార్మికులను తరలిస్తున్న ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో దుబాయ్ లో నివసించే కార్మికులు ఎమిరాతి పరిధి దాటి వెళ్లొద్దని, అలాగే ఇతర ఎమిరాతిలను అనుమతించేది లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినా..దుబాయ్, షార్జా మధ్య కార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో షార్జా పోలీసులు సమన్వయం చేసుకుంటూ తనిఖీలు చేపడుతున్నామని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ తెలిపారు. ప్రతి బస్సును చెక్ చేయాల్సింది ఆదేశించామని అన్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత







