పవిత్ర రమదాన్ మాసంలో ఇంట్లోనే ప్రార్ధనలు చేయాలి--దుబాయ్ ప్రభుత్వం

- April 20, 2020 , by Maagulf
పవిత్ర రమదాన్ మాసంలో ఇంట్లోనే ప్రార్ధనలు చేయాలి--దుబాయ్ ప్రభుత్వం

కరోనా వైరస్‌: ఇంటి వద్దనే రమదాన్‌ తరావీహ్‌ముస్లింలు తరావీహ్‌ ప్రార్థనల్ని పవిత్ర రమదాన్‌ మాసంలో ఇంటి వద్దనే చేసుకోవచ్చు. ఈ మేరకు ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఛారిటబుల్‌ యాక్టివిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎసిఎడి) - దుబాయ్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజువారీచేసే ఐదు ప్రార్థనల్లానే తవారీహ్‌ ప్రార్థనలు కూడా ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. కరోనా వైరస్‌ నేపథ్యంలో, మాస్క్‌లు మూసివేసిన దరిమిలా, ఇంటి వద్దన ప్రార్థనలు చేసుకోవాల్సి వుంటుందని డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. మాస్క్‌ల వద్ద చేసే ప్రార్థనలతో వచ్చే ఫలితం ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసినా దక్కుతుందని ఐఎసిఎడి వెల్లడించింది. పవిత్ర ఖురాన్‌ పఠనాన్ని పూర్తి చేసేందుకు ముస్లింలు తరావీహ్‌ ప్రార్థన చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com