భారత పౌరులను కూడా చూసుకుంటాం:లీ హసీన్ లూన్గ్
- April 24, 2020
కరోనావైరస్ మహమ్మారి తో బాధపడుతున్న ఇతర సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా చూసుకుంటామని సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. సింగపూర్, భారతదేశంలో కొనసాగుతున్న మహమ్మారి పరిస్థితి గురించి తాను ప్రధాని మోడీతో టెలిఫోన్ చర్చలు జరిపినట్లు లీ గురువారం ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. వలస కార్మికులు ఇక్కడ పనిచేసేందుకు గాను వ్యక్తిగత త్యాగాలు చేశారు.
వారు సింగపూర్కు ఎంతో కృషి చేశారు, కాబట్టి వారిని కూడా కాపాడే బాధ్యత మాకు ఉంది. అని పేర్కొన్నారు. కాగా భారత్ లో ఉన్న సింగపూర్ వాసులను తరలించడంలో భారతదేశం చేసిన సహాయం మరువలేనిదని.. ఈ విషయంలో ఆయన ప్రధాని మోదికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఇర్రుక్కుపోయిన 699 మంది సింగపూర్ పౌరులను ఆ దేశానికీ చేర్చింది భారత్.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!