కోవిడ్ 19: రమదాన్ మాసంలో పది మందికి మించి గుమికూడొద్దు!
- April 24, 2020
దుబాయ్:కరోనా కట్టడి కోసం పవిత్ర రమదాన్ మాసంలో పాటించాల్సిన జాగ్రత్తలపై దుబాయ్ ప్రభుత్వం కొత్తగా మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పది మంది కంటే ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని సూచించింది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సామూహిక ప్రార్ధనలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. అలాగే వైరస్ ఒకరి నుంచి మరొకరిని తేలికగా వ్యాప్తిస్తుంది కనుక కౌగిలింతలు, షేక్ హ్యాండ్ లు కూడా ఇవ్వొద్దని తెలిపింది. సుహూర్, ఇఫ్తార్ విందుల విషయంలోనూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరింది. వీలైనంత వరకు కుటుంబ సభ్యలకే పరిమితం కావాలని, తప్పదనుకంటే అతి సన్నిహితులను ఆహ్వానించుకోవచ్చని అధికారులు సూచించారు. ఇక రమదాన్ మాసంలో ఎలాంటి దానాలు చేయాలన్నా గుర్తింపు పొందిన స్వచంద సంస్థల ద్వారాగానీ, ప్రభుత్వ సంస్థలద్వారా మాత్రమే చేయాలని కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







