2016 ఫిబ్రవరి 24 నుంచి ఆసియా కప్ ట్వంటీ
- January 28, 2016
ఆసియా కప్ ట్వంటీ20 2016 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు బంగ్లాదేశ్లో జరగనుంది. తొలిసారి ఆసియా కప్ ఫార్మెట్లో కొన్ని మార్పులు చేశారు. నిజానికి ఆసియా కప్ టోర్నమెంట్లో 50 ఓవర్ల మ్యాచ్లు జరుగుతాయి.అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో భారత్లో ఐసీసీ వరల్డ్ టీ20 జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్లో నిర్వహించే మ్యాచ్లను ట్వంటీ20 ఫార్మెట్లో నిర్వహించనున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు క్వాలిఫయిర్ జట్టు ఇందులో పాల్గొంటున్నాయి.ఆప్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఒమన్ ఈ నాలుగు జట్లలో ఏదో ఒక జట్టు క్వాలిఫయిర్గా టోర్నీలో పాల్గొంటుంది. ఈ నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, ఇండియా జట్లు తలపడనున్నాయి.ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్లు జరగనున్నాయి. దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఆసియా కప్లో భాగంగా అన్ని మ్యాచ్లు కూడా బంగ్లాదేశ్లోని మిర్పుర్లో ఉన్న షేర్ ఇ బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







