భారత్‌లో ఒక్కరోజులోనే 56 కరోనా మరణాలు

- April 25, 2020 , by Maagulf
భారత్‌లో ఒక్కరోజులోనే 56 కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో ఈ ప్రాణాంతకర వైరస్ రోజు రోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఒక్కరోజే 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 779 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య 24,942కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com