యూఏఈ:వాహనాలతో స్టంట్స్.. అజ్మన్ పరిధిలో 34 వాహనాలు సీజ్
- April 25, 2020
యూఏఈ:ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటమే కాకుండా..ఓవర్ స్పీడ్ తో స్టంట్స్ చేస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎమిరాతిలోని హేలియో జిల్లాలో మొత్తం 34 వెహికిల్స్ సీజ్ చేశారు. అయితే..ఇందులో చాలా వాహనాలకు నెంబర్ ప్లేట్లు కూడా లేవు. ఇందులో 17 మంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు వారి వెహికిల్స్ సీజ్ చేశామని, మిగిలిన 17 వాహనాలను ఓవర్ స్పీడుతో స్టంట్స్ చేసినందుకు సీజ్ చేశామని ట్రాఫిక్, పాట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అబ్ధుల్లా అల్ ఫలాసి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇతర వాహనదారులను ఇబ్బందిపెట్టేలా డ్రైవింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన వాహనాలను ఆరు నెలల పాటు మళ్లీ రోడ్డు మీదకు రాకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజా భద్రతకు భంగం కలిగించేలా రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సైఫ్ అబ్ధుల్లా...ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేసిన వారి గురించి 901 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే..999కి ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







