రోగుల సంరక్షణకు అన్ని చర్యలు : నందమూరి బాలకృష్ణ

- April 26, 2020 , by Maagulf
రోగుల సంరక్షణకు అన్ని చర్యలు : నందమూరి బాలకృష్ణ

రోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు, సిబ్బందికి నిత్యావసర వస్తువులతో పాటు  ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హాస్పిటల్ లోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు, సిబ్బందితో పాటు హాస్పిటల్ లో  సేవలందిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉండేందుకు నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మితుకుమల్లి భరత్, జే ఎస్ ఆర్ ప్రసాద్ తోపాటు పలువురు అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com