స్వదేశానికి వెళ్లాలనుకునే వారి జాబితా సిద్ధం చేయనున్న భారత రాయబార కార్యాలయం
- April 28, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే..ఎప్పుడు, ఎంతమందిని అనే దానిపై స్పష్టత లేకున్నా..తరలింపు దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయులతో యూఏఈలో చిక్కుకుపోయిన పర్యాటకుల వివరాలతో జాబితాను యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సిద్ధం చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుంది. అయితే..దీనిపై న్యూఢిల్లీ నుంచి ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సి ఉందని యూఏఈ భారత రాయబారి పవన్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే ఇంకా స్పష్టత లేదని..త్వరలోనే ప్రారంభించాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే...ఖతార్ లోని రాయబార కార్యాలయం మాత్రం స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న ప్రవాసభారతీయులు, కరోనాతో చిక్కుకుపోయిన భారత పర్యాటకుల వివరాలతో జాబితాను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. స్వదేశానికి వెళ్లాలని ఎదురుచూస్తున్న వారు https://forms.gle/SeB52ZJymC8VR8HN8 లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకొని రాయబార కార్యాలయం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న వారి వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని..అయితే..విమానాలు ఎప్పుడు పునరుద్దరిస్తారనే వివరాలపై స్పష్టత మాత్రం లేదని కూడా ఖతార్ లోని రాయబార కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







