మస్కట్: మోసం, చోరీకి పాల్పడిన ఆరుగురి అరెస్ట్

- April 30, 2020 , by Maagulf
మస్కట్: మోసం, చోరీకి పాల్పడిన ఆరుగురి అరెస్ట్

మస్కట్:బ్యాంక్ ఖాతాదారులను మాయమాటలతో బురిడి కొట్టించి ఖాతాలో డబ్బులు కాజేస్తున్న ముఠా ఆటకట్టించారు రాయల్ ఒమన్ పోలీసులు. ముఠాలోని ఆరుగురు ప్రవాసీయులు బ్యాంక్ ఖతాదారులకు..తమ బ్యాంక్ కార్డు బ్లాక్ అవుతుందని టెక్ట్స్ మెసేజ్ చేసేవారని పోలీసులు వివరించారు. ఖాతాదారులు కంగారులో ఉండగానే వారి నుంచి బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులను కాజేసేవారు. బాధితుల ఫిర్యాదుతో ఆరుగురు ప్రవాసీయుల ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు బహుమతులు గెలుచుకున్నట్లు, లక్కీ లాటరీ తగిలిందని లేదంటే బ్యాంక్ కార్డు బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకూడదని పోలీసులు హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com