భారత్:లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రెండే మార్గాలు..
- May 01, 2020
భారత్:కరోనా ఎఫెక్ట్తో దాదాపు రెండు నెలలు రోడ్డు మీద రహదారులు, ఆకాశ మార్గాలు మూత పడ్డాయి. ఈనెల 4 నుంచి విమాన ఆపరేషన్లకు సిద్దంగా ఉండాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగిన మార్గదర్శకాలను కూడా సూచించడంతో కొంత పాక్షిక సడలింపులకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ విమానాలు నడిపితే సోషల్ డిస్టెన్స్లో భాగంగా 30 శాతం ప్రయాణీకులకే పరిమితమని సమాచారం. అయితే ఇది మాత్రం ఆచరణ సాధ్యం కాదని ఎయిర్లైన్స్ మేనేజర్లు అంటున్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ గిరి మధుసూనరావు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై మేనేజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేవలం 30 శాతం మందినే ఎక్కించుకుంటే వయబిలిటీ ఉండదని, అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.
ఇలాంటప్పుడు విమానయాన సంస్థలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.. దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీజీఎఫ్ రాదు. అలాంటి సమయంలో ప్రోత్సాహకంగా ఎయిర్ పోర్టులలో ఏఏఐలకు చెల్లించే ఫీజుల విషయంలో మాత్రం మినహాయింపులు ఇవ్వొచ్చు. దీనివల్ల నెలరోజుల్లో కోల్పోయిన ఆదాయంలో కొంత మేర ఉపశమనం లభిస్తుంది.
ఇక రెండో ఆప్షన్ చార్జీలు పెంచడం. 30 శాతం ప్రయాణీకులనే అనుమతిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే ఛార్జీలు డబ్బుల్ చేస్తేనే సంస్థ కోలుకోగలదు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు తప్ప సామాన్య జనం విమానం ఎక్కాలంటే వీపు మోతే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







