కువైట్ : సిబ్బందికి జీతాలు ఇవ్వని 6 ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు మందలింపు
- May 03, 2020
కువైట్ కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధించటంపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు తమకు జీతాలు ఇవ్వటం లేదని తమకు చాలా ఫిర్యాదులు అందాయని విద్యాశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించామని, ఆరు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఆ ఆరు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించింది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయాలను పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఉపేక్షించబోమని హెచ్చరించింది. అలాగే సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి పేరోల్ ను సిద్ధం చేయాలంటూ ప్రైవేట్ స్కూల్స్ సాధారణ పరిపాలన విభాగాన్ని విద్యాశాఖ కోరింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







