రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..

- January 28, 2016 , by Maagulf
రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..

రాష్ట్రంలో 36వేల మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారని ఏపీఎస్‌ఆర్టీసీ కర్షకపరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉద్యోగితో పాటు భార్యకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ప్యాసింజర్ సర్వీసు నుంచి డీలక్స్ వరకు ఉచిత ప్రయాణం, ఆపై సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని వరహాలనాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని ఆర్టీసీ యాజమాన్యం నిలబెట్టుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com