భారత్‌ మరోసారి ఆకాశ్‌ క్షిపణిని పరీక్షించింది

- January 28, 2016 , by Maagulf
భారత్‌ మరోసారి ఆకాశ్‌ క్షిపణిని పరీక్షించింది

భారత్‌ మరోసారి ఆకాశ్‌ క్షిపణిని పరీక్షించింది. ఒడిశాలోని చందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతగా నిర్వహించింది. కాంప్లెక్స్‌ 3 నుంచి దూసుకెళ్లిన ఆకాశ్‌ 25 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశ్‌ క్షిపణిని 2009లో డీఆర్‌డీవో సంస్థ తయారు చేసింది. ఇది భూ ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. జూలై 2015లో ఆకాశ్‌ క్షిపణిని డీఆర్‌డీవో సంస్థ భారత వాయుసేనకు అప్పగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com