ఘోర రైలు ప్రమాదం..15మంది వలస కూలీలు మృతి

- May 08, 2020 , by Maagulf
ఘోర రైలు ప్రమాదం..15మంది వలస కూలీలు మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్‌ రైలు వెళ్ళినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ట్రాక్‌పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్‌ మధ్య నడిచే గూడ్స్‌ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com