గ్యాస్ బాధితుల మృతికి కువైట్ అమిర్ సంతాపం

- May 08, 2020 , by Maagulf
గ్యాస్ బాధితుల మృతికి కువైట్ అమిర్ సంతాపం

కువైట్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నం లో సంభవించిన గ్యాస్ లీకేజీ సంఘటనలో మృతిచెందిన కుటుంబాలకు కువైట్ అమీర్ తన సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కి పంపిన సందేశంలో గురువారం కెమికల్ ఫ్యాక్టరీ లో జరిగిన ప్రాణనష్టం తనను తీవ్రంగా కలచివేసిందని షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంతాప సందేశం పంపిన వారిలో ప్రిన్స్ షేక్ నవ్వఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్, ప్రధాని షేక్ సబాహ్ ఖలీద్ అల్ హాండ్ అల్ సబాహ్ కూడా ఉన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com