స్కూల్‌ బస్సు ప్రమాదంలో 5 మంది మృతి

- January 29, 2016 , by Maagulf
స్కూల్‌ బస్సు ప్రమాదంలో 5 మంది మృతి

బహ్లా ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో ఇద్దరు బస్‌ డ్రైవర్లు. తీవ్రంగా గాయపడ్డ టీచర్‌ చికిత్స పొందుతూ మరణించారు. రాయల్‌ ఒమన్‌ పోలీసులు, ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన టీచర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు అధికారులు చెప్పారు. 33 మందితో వెళుతున్న బస్సు, ఓ ట్రక్కుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు బస్సుల్లో 120 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్ళారు. మూడు బస్సులు సేఫ్‌గా తిరిగి వచ్చాయి. ఒక బస్సు దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యిందని స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com