స్కూల్ బస్సు ప్రమాదంలో 5 మంది మృతి
- January 29, 2016
బహ్లా ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో ఇద్దరు బస్ డ్రైవర్లు. తీవ్రంగా గాయపడ్డ టీచర్ చికిత్స పొందుతూ మరణించారు. రాయల్ ఒమన్ పోలీసులు, ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు అధికారులు చెప్పారు. 33 మందితో వెళుతున్న బస్సు, ఓ ట్రక్కుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు బస్సుల్లో 120 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్ళారు. మూడు బస్సులు సేఫ్గా తిరిగి వచ్చాయి. ఒక బస్సు దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యిందని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









