దుబాయ్:బిల్డింగ్ పై నుంచి కిందపడి 12వ గ్రేడ్ విద్యార్ధి మృతి
- May 13, 2020
దుబాయ్ లోని వార్సన్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి కింద పడి 12వ గ్రేడ్ విద్యార్ధి మృతి చెందాడు. బాల్కానీలో అన్నాదమ్ములు ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం తెల్సుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అయితే..అప్పటికే అతను మృతిచెందాడని తెలిపారు. బాల్కనీలో తన సోదరుడితో కలిసి ఫుట్ బాల్ ఆడుకుంటూ ఉండగా...బాల్ కింద పడిందని, బాల్ ను పట్టుకునే క్రమంలో మృతుడు ప్రమాదవశాత్తు కిందపడినట్లు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండాల్సి రావటంతో పిల్లలు బోర్ కొట్టి ఆటలు ఆడే అవకాశాలు లేకపోలేదని..అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తం ఉండాలన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!







