ఏపీ: 2230 కు చేరిన కరోనా కేసులు

- May 17, 2020 , by Maagulf
ఏపీ: 2230 కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2230కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 9880 సాంపిల్స్ ని పరీక్షించగా.. 25 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా, కొత్తగా 103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 1433 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక, 747మంది చికిత్స పొందుతున్నారు . కాగా, కరోనాతో కృష్ణ జిల్లాలో మరొకరు చనిపోగా.. మొత్తం మరణాలు 50కు చేరాయి. అయితే, తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళంలో ఎక్కువగా 7కేసులు నమోదయ్యాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com