కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం:నిర్మలా సీతారామన్
- May 17, 2020
ఢిల్లీ: కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మన్రెగా (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కోసం 40 వేల కోట్ల రూపాయల అదనపు నిధులను సమకూర్చింది. ఇది గతంలో కేటాయించిన నిధులకు అదనం. దీంతో మన్రెగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు తాజా కేటాయింపులు మేలు చేయనున్నాయి. మన్రెగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకారం వివిధ రంగాలకు కేటాయింపులను వెల్లడించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోరోజు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు.
నిర్మాణరంగంలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు నేరుగా అందించామన్న నిర్మలా సీతారామన్ పేదలు, కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని ప్రకటించారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా తమ ప్రధానాంశాలని చెప్పారు. 8.1 కోట్ల మంది కార్మికులకు కిసాన్ యోజన కింద రూ.16,394కోట్ల నగదు కేటాయించామన్నారు. జన్ధన్ యోజన కింద రూ.10,025 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు రూ.3,950కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు. 8.9కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున పడ్డాయని చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







