కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం:నిర్మలా సీతారామన్
- May 17, 2020
ఢిల్లీ: కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మన్రెగా (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కోసం 40 వేల కోట్ల రూపాయల అదనపు నిధులను సమకూర్చింది. ఇది గతంలో కేటాయించిన నిధులకు అదనం. దీంతో మన్రెగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు తాజా కేటాయింపులు మేలు చేయనున్నాయి. మన్రెగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకారం వివిధ రంగాలకు కేటాయింపులను వెల్లడించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోరోజు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు.
నిర్మాణరంగంలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు నేరుగా అందించామన్న నిర్మలా సీతారామన్ పేదలు, కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని ప్రకటించారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా తమ ప్రధానాంశాలని చెప్పారు. 8.1 కోట్ల మంది కార్మికులకు కిసాన్ యోజన కింద రూ.16,394కోట్ల నగదు కేటాయించామన్నారు. జన్ధన్ యోజన కింద రూ.10,025 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు రూ.3,950కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు. 8.9కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున పడ్డాయని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







