నేడు హైదరాబాద్ లో కే.సి.ఆర్ బహిరంగ సభ
- January 29, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన పర్యవేక్షించారు. తెరాస అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెరాస ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి మొత్తంగా లక్ష మందిని సమీకరించేందుకు చర్యలు చేపట్టింది. బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్రెడ్డి పరేడ్ మైదానంలో భద్రత చర్యల్ని సమీక్షించారు. మొత్తం 2వేల మందితో భద్రత చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వచ్చే ప్రజల వాహనాలు నిలిపేందుకు సంజీవయ్య పార్క్, బల్కంపేట ఫ్లైఓవర్, బేగంపేట విమానాశ్రయం, రైల్నిలయం ఆర్ఆర్సీ మైదానం, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల, దోభీఘాట్, అల్వాల్ కూరగాయల మార్కెట్.. తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







