రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ ప్రాజెక్ట్ .'గవర్నమెంట్'..
- January 29, 2016
వీరప్పన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ నార్త్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. కొంత కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్న వర్మ, వీరప్పన్ సినిమా తరువాత బాలీవుడ్ వెళ్లిపోయాడు. వీరప్పన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు.'గవర్నమెంట్' పేరుతో వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరోసారి తనకు బాగా పట్టున్న అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకోనున్నాడు. అయితే తన గత సినిమాల మాదిరిగా రాసుకున్న కథతో కాకుండా ముంబై మాఫియాలో నిజంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు.వీరప్పన్ సినిమాను తీసినంత రియలిస్టిక్ గా ముంబై మాఫియా నేపథ్యాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.ముఖ్యంగా గవర్నమెంట్ సినిమాలో దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ ల స్నేహం, తరువాత వారి మధ్య మనస్పర్థలు రావటం. దావూద్ కు తీవ్రవాదులు, ఐయస్ ఐతో ఉన్న సంబంధాలు, అండర్ వరల్డ్ మాఫియాకు ముంబై రాజకీయాలకు, పోలీస్ వ్యవస్థకు ఉన్న రిలేషన్స్ గురించి చూపించనున్నాడట. తను ప్రతి సినిమాను వివాదాస్పదం చేసే వర్మ ఇలాంటి వివాదాస్పద కథను ఎంచుకొని ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







